పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య
కాకతీయ, హనుమకొండ : అక్రమంగా నిల్వ చేసిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం.. మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిపల్లి గ్రామంలోని మధు తండాలో ఉన్న రేషన్ డీలర్ పోరిక కమల ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 130 బస్తాలు (65 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ. 2,27,500గా అంచనా వేశారు. ఈ కేసులో పోరిక కమల , లంబాడి, రేషన్ డీలర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నిందితురాలిని కేయూసీ పోలీసులకు అప్పగించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు పంపించారు. ఈ దాడిలో ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ ఎస్. రాజు, ఆర్ఎస్ఐ ఓ. భానుప్రకాశ్ తదితర టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.


