ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఊరూరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, ఎంపీడీవో కృష్ణవేణి, పాక శ్రీనివాస్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించారు.
16వ డివిజన్ ధర్మారంలో..
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.స్థానిక నాయకులు,యువజన సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా కోటగండి అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో చైర్మన్ ఓరుగంటి అశోక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ ఎన్. సీతారామరాజు ఆధ్వర్యంలో గీసుగొండ పోలీస్ సిబ్బందికి, మండల విలేకరులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ డి.విశ్వేశ్వర్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రి చైర్మన్ ఓరుగంటి అశోక్,డాక్టర్లను సిబ్బందిని అభినందించారు.
ఎలుకుర్తి హవేలీలో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఎలుకుర్తి హవేలీలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంపూర్ సర్పంచ్ రడం భరత్ కుమార్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా నిమ్స్ ఆసుపత్రి అనుసంధానకర్త డాక్టర్ మార్తా రమేష్, మండల నాయకులు అల్లం మర్రెడ్డి, పెగళ్లపాటి లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమంలో గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,మనుగొండ సర్పంచ్ శ్రవణ్, సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర, స్థానిక నాయకులు బొడిగే శోభన్ మంద అనిల్,పవన్, మంద రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


