16న ఇసుక వేలం..
తహసిల్దార్ కే.సురేఖ
కాకతీయ,శంకరపట్నం:మండల తహసిల్దార్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న ఐదు ట్రాక్టర్ల ఇసుకను ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు తహసిల్దార్ కే. సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
హుజురాబాద్ అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో తహసిల్దార్ కార్యాలయానికి హాజరై వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.


