epaper
Thursday, April 16, 2026
epaper

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం
భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఒకే గొడుగు కింద‌కు రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు
ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కూసుమంచి మండలంలో భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్
అమలు తీరుపై అధికారులతో క‌లెక్ట‌ర్ సమీక్ష‌

కాకతీయ,ఖమ్మం : ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్ అమలు పై రెవెన్యూ, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ భూ సమస్యలకు పరిష్కారం కోసం రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కింద‌కు తెస్తున్న‌ట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ప్రవేశపెట్టిందని అన్నారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ లు అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ రూపొందించామని అన్నారు. రైతులు ఇంటి వద్ద నుంచి కూడా స్లాట్ బుకింగ్ చేసుకునేలా పోర్టల్ తయారు చేశామని తెలిపారు. రైతులు లాగిన్ కాగానే భూమి వివరాలు కనిపిస్తాయని అన్నారు.

ద‌రఖాస్తు త‌ర్వాత ఏడు రోజుల్లో స‌ర్వే పూర్తి

ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత గ్రామంలోని లైసెన్స్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, రెండు రోజుల్లో ఆ రైతు భూమికి సరిహద్దు ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల లోపు సర్వే పూర్తి చేస్తారని తెలిపారు. ఈ వివరాలను సర్వేయర్ సిస్టంలో నమోదు చేశాక దరఖాస్తుదారుడైన రైతు సర్వే మ్యాప్ నకు యూనిక్, భూధార్ నెంబర్లు కేటాయిస్తారని భూభారతి పోర్టల్ లో కూడా వివరాలు నిక్షిప్తమవుతాయని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ జనరేట్ చేసి పోర్టల్ లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తాయని తెలిపారు.  పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందుగా కూసుమంచి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూ భారతి కింద ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరితగతిన పరిష్కారించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ అధికారి రమేష్, కూసుమంచి మండల తహసీల్దారు సైదులు, కలెక్టరేట్ భూ భారతి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి

యువతకు అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img