చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదాలకు కారణం
జాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ప్రతీఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలి
కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం : చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటాయని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. గురువారం ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇల్లందులోని అయిత ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మందికి పైగా స్థానికులు,ప్రముఖులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు.ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం,అతివేగం,మద్యం సేవించి వాహనం నడపడం,మొబైల్ ఫోన్ వినియోగం చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వలననే జరుగుతున్నాయని తెలిపారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు,సుదూర ప్రయాణాలు చేసే లారీ బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే,ట్రాఫిక్ సిగ్నల్స్,రోడ్ సైన్ బోర్డులు,ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపైనిర్లక్ష్యంచేయకుండా,సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు.


