epaper
Thursday, April 16, 2026
epaper

లెక్క తప్పితే పదవి గల్లంతే!

లెక్క తప్పితే పదవి గల్లంతే!
ఎన్నిక‌ల వ్యయంలో ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే
పంచాయతీ కార్యదర్శుల కఠిన ఆదేశాలు
ఆయోమయంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందం ఇంకా చల్లారకముందే నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు అసలు పరీక్ష మొదలైంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులపై ఖచ్చితమైన లెక్కలు సమర్పించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులు గడువు విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. లెక్కలు తప్పితే గెలుపు చెల్లదని పంచాయతీరాజ్ చట్టం–2018 స్పష్టం చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం ఎన్నికల ఖర్చుల్లో తేడాలు ఉన్నట్లయితే గెలిచిన అభ్యర్థుల పదవి రద్దుతో పాటు రానున్న మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి వస్తుంది. ఈ నిబంధనలు కటువుగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఖర్చుల నివేదికలు సిద్ధం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామపంచాయతీల్లో త్రిముఖ పార్టీల పోటీ నడవడంతో గెలుపుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఖర్చులన్నింటికీ సరైన ఆధారాలతో లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గడువు ముందుగానే.. అభ్యర్థుల్లో కలవరం..!

గత ఎన్నికల్లో 45 రోజుల గడువు ఉండగా, ఈసారి ముందుగానే ఖర్చుల లెక్కలు సమర్పించాలని ఆదేశాలు రావడంతో సర్పంచులు, వార్డు సభ్యులు అయోమయంలో పడుతున్నారు. గుర్తులు కేటాయించిన నాటి నుంచే చేసిన ప్రతి ఖర్చుకూ రసీదులు చూపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వందలాది గ్రామాల్లో పోటీ తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు ఖర్చుల సర్దుబాటుపై తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.

ఖర్చు పరిమితులు ఇవే..!

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఐదువేల జనాభా లోపు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ గరిష్టంగా రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. ఐదువేల పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.50 వేలే పరిమితి. ఈ పరిమితిని మించి ఖర్చు చేసినట్లు తేలితే చర్యలు తప్పవు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించి రసీదు పొందాలి. అనంతరం ఫిబ్రవరి 15లోగా టి–పోల్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మండలానికి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తంగా చూస్తే.. గెలుపు తర్వాత అసలైన సవాల్ మొదలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లెక్క తప్పితే పదవి గల్లంతేనన్న హెచ్చరికతో గ్రామ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి

ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా ప‌రిష్క‌రించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వ‌రిత‌గ‌తిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్ల‌కు ప‌రిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర...

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి...

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం

భూ భారతితో సమస్యలకు శాశ్వ‌త పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు...

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం

చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం జాగ్ర‌త్త‌తోనే రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌ ప్ర‌తీఒక్క‌రూ భద్రతా...

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌

వీరస్వామికి దళిత రత్న బహూక‌ర‌ణ‌ రవీంద్రభారతిలో ఘనంగా సత్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ :...

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి...

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ కాలేజీలో క్షుద్రపూజల కలకలం కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img