epaper
Saturday, November 15, 2025
epaper

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  • విజయవంతంకోసం విస్తృత ప్రచారం కల్పించాలి
  • కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కాక‌తీయ‌, కొత్తగూడెం రూరల్ : సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో ఈనెల 12న కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జాబ్ మేళా సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం కేంద్రంగా జరిగే ఈ జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి 10వేల మందికి పైగా హాజరయ్యేలా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. మూడు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళా నిరుద్యోగల పాలిట వరంగా మారుతుందని తెలిపారు.

10వ తరగతి పాస్ అయిన వారి నుంచి మొదలుకుని, ఐటిఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబిఏ, ఎంసిఓ, గ్రాడ్యూయేషన్, పోస్టుగ్రాడ్యుయేట్, బిఇ, బిటెక్, ఎంటెక్, తదితర చదువులు చదివిన వారంతా ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేందుకు హాజరుకావచ్చని చెప్పారు. దిగ్గజ సాఫ్ట్వేర్, ఫార్మసీ కంపెనీలతో పాటు పలు కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేన్ చేయించుకోవాల్సి ఉంటుందని, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వీలుకాని వారు కూడా నేరుగా హాజరై స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 5 కం పెనీలు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు అయ్యే విధంగా టోకెన్ పాస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

ఉద్యోగానికి అభ్యర్థులు ఎంపికైన వెంటనే అక్కడికక్కడే ఆయా కంపెనీలు ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రాలను కూడా ప్రముఖల చేతుల మీదుగా అందిస్తారని చెప్పారు. అనంతరం జాబ్ మేళా ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. తహసీల్దార్ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మురళీధర్, సింగరేణి ఎసీ-2 జిఎం కోటిరెడ్డి, ఏజిఎం (సివిల్) రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) మోహన్ రావు, ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య, జాబ్ మేళా కో-ఆర్డినేటర్ చందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డిఓ మధు, కార్పోరేషన్ కమీషనర్ సుజాత, డీఎస్పీ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాపా, గుర్తింపు సంఘం నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, జి వీరస్వామి, తహశిల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img