epaper
Thursday, January 15, 2026
epaper

భారీగా గంజాయి పట్టివేత

  • పట్టుబడిన ప్యాకెట్ల విలువ రూ.2.50 కోట్లు
  • గంజాయి ప్యాకెట్లు, కంటైనర్, రెండు ఫోన్లు స్వాధీనం
  • పోలీసులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: సులువుగా డబ్బు సంపాదించాలనే కొందరు సిండికేట్గా మారి మాఫియా పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే కోవాకు చెందిన ఒక ముఠా నిషేధిత గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన సంఘటన జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో భారీ గంజాయి పోలీసులకు పట్టుబడింది. మహారాష్ట్ర, కర్ణాటక చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో గంజాయిని భద్రాచలం నుండి కొత్తగూడెం ఖమ్మం మీదుగా రాజస్థాన్లోని జైపూర్ కు అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం సిసిఎస్ పోలీసులు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి తన సిబ్బందితో కలిసి సంయుక్తంగా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో ఉన్న అన్నపూర్ణ బేకరీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఓ లారీ కంటైనర్ కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా వస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు ఆపారు. కంటైనర్ ను తనిఖీ చేయగా అందులో 96 ప్రభుత్వ నిషేదిత గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కంటైనర్ లో 96 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా 499 కేజీలు గంజాయి ఉన్నట్లుగా తేలిందన్నారు. దీని విలువ సుమారుగా రూ.2.50కోట్టు ఉంటుందన్నారు. గంజాయిని, దాన్ని అక్రమ రవాణా చేస్తున్న జగదీశ్ దయారాం పాటిల్, సంజు కుమార్ ను అదుపులోకి తీసుకొని వీరిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మరో ఇద్దరు అమిత్ రోహిదాస్ పాటిల్, హరి పరారీలో ఉన్నారన్నారు. అశోక్ లేలాండ్ కంటైనర్ లారీ, రెండు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నామన్నారు. గంజాయిని, నేరస్తులను పట్టుకోవడంలో సహకరించిన సిసిఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు వారి సిబ్బందిని, సుజాతనగర్ ఎస్సై రమాదేవిని వారి సిబ్బందిని ఈ కేసు విచారణాధికారి సిఐ వెంకటేశ్వర్లు, వారి సిబ్బందిని కేసు పర్యవేక్షణ అధికారి డీఎస్.పిని ఎస్పీ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img