epaper
Saturday, November 15, 2025
epaper

చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్న వారిని వదిలేది లేదు : లంబాడీల జేఏసీ భారీ ర్యాలీ

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూక్యా రమేష్, లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన వేలాదిగా తరలి వచ్చిన గిరిజనులు (లంబాడీ) తో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరిలి వచ్చి శాంతియుత ర్యాలీలో పాల్గొన్న లంబాడీ బిడ్డలకు జిల్లా లంబాడీ జేఏసి నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, గుగులోత్ రాజేష్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ లు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గతంలో కొందరు స్వార్థపూరితంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన పిటిషన్ పై గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1970 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎస్టీ జాబితాలో బంజారాలను చేర్చారని, బంజారాలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బంజారాలన్నారు. గౌరవ హైకోర్టు లంబాడీలపై వేసిన పిటిషన్ కొట్టి వేసినప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు సుప్రీంకోర్టులో బంజారాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కారణంగా బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ హామీ అమలైందని తమకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలన్నారు.

లేకుంటే రాబోవు స్థానిక సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది బంజారాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో జరగనున్న పునర్విభజన నేపథ్యంలో బంజారా ఆదివాసి.. ఎస్టీలకు నష్టం జరిగే అవకాశం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎస్టీ ప్రజానీకం తరుపున ఎస్టీ ప్రజా ప్రతినిధులు తమ గొంతు వినిపించాలని, ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదని హెచ్చరించారు.

స్వలాభం కోసమే తెల్లం, సోయం గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలుసుకొని, ఇద్దరిని ఆదివాసీ సమాజం నమ్మడం లేదని, వీళ్ళ వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరో లంబాడీ సమాజానికి తెలుసని వారిని వెంటాడి మరీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. అన్నదమ్ముల ఉండి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం రండని భద్రాద్రి కొత్తగూడెం లంబాడీ జేఏసి నాయకులు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img