అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.బుధవారం రాత్రి కొత్తూరు గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతుడు పర్వతగిరి మండలం రావూరు గ్రామానికి చెందిన దామెర శ్రీనివాస్(33) గా గుర్తించారు.అతనికి భార్యతో పాటు కుమారుడు,కుమార్తె ఉన్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…శ్రీనివాస్ కొత్తూరు గ్రామంలో మీసేవ నిర్వహిస్తుండేవాడని,అదే గ్రామానికి ప్రతి రోజు ఉదయం చేరుకొని.. మీసేవ మూసివేసి సాయంత్రం తన స్వగ్రామానికి తిరిగి వెళ్లేవాడని పేర్కొన్నారు.బుధవారం రాత్రి కొత్తూరు శివారులో శ్రీనివాస్ విజేతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


