epaper
Thursday, April 16, 2026
epaper

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!
హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ
మద్దతు ధర ఇవ్వాలి… రైతులను ఆదుకోవాలి
చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడుతాం
వారం రోజుల్లో మక్కలు కొనుగోలు పూర్తి చేయాలి
లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాకతీయ,రాయపర్తి/పాలకుర్తి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,దేశానికే అన్నం పెట్టే అన్నదాతను అరిగోస పెడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.గురువారం ఆయన పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డును సందర్శించారు.ఈ నేపథ్యంలో అక్కడున్న రైతులతో ఎర్రబెల్లి ముచ్చటించారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.గన్నీ బ్యాగులు లేవని…లారీలు సరిగా రావడం లేదని తమ గోడును వెళ్ళబోసుకున్నారు.అక్కడికక్కడే ఎర్రబెల్లి స్పందించి జిల్లా మార్కెటింగ్ అధికారి(డిఎం)తో చరవాణిలో మాట్లాడారు.మక్కల(మొక్కజొన్నలు) కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు మక్కలు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా ఎందుకు కాంటాలు పెట్టడం లేదని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వలేదని…ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ అని ఖరాఖండిగా చెప్పారు.మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యమే దీనికి నిదర్శనమని అన్నారు.బోనస్ ఇస్తానని చెప్పిన మాటలు అన్ని బోగస్ మాటలే అని ఎద్దేవ చేశారు. మక్కలకు మద్దతు ధర రూ.2400 ఉండగా… ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటకకు వెళ్లి రూ.1600నుండి1700లకే రైతులు తమ పంటను విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రను వీడి వారం రోజుల్లో మక్కలు కొనుగోళ్లను పూర్తిచేయాలని డిమాండ్ చేసారు.లేదంటే జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img