మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి
జార్జ్ రెడ్డికి అదే మనమిచ్చే నివాళి
పీడీఎస్ యూ నాయకుల పిలుపు
కాకతీయ, ఖమ్మం : విప్లవ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి వర్ధంతిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ, ప్రస్తుత నాయకుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్, మాజీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ జార్జ్ రెడ్డి శాస్త్రీయ భావజాలంతో మతోన్మాద చీకట్లను ఎదుర్కొన్న గొప్ప నాయకుడని కొనియాడారు. “జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో” అంటూ నినదిస్తూ విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తిని నింపారని తెలిపారు.
స్ఫూర్తిగా నిలిచిన పోరాటం
1972 ఏప్రిల్ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన దాడిలో అమరుడైన జార్జ్ రెడ్డి ఆలోచనలు నేటికీ విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన మరణించి దశాబ్దాలు గడిచినా పోరాట స్ఫూర్తి సజీవంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో కుల, మతాల పేరుతో విభజనలు పెంచుతూ విద్యా రంగాన్ని బలహీనపరిచే విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. శాస్త్రీయ విద్యా విధానం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిరోమణి, ఝాన్సీ, వెంగల్ రావు, మల్లయ్య, నాగేశ్వరరావు, కొటేశ్వరరావు, లక్ష్మి, లక్ష్మణ్, వెంకటేష్, వినయ్, హరిచంద్ర ప్రసాద్, తిమ్మిడి రఘు, శుశాంత్, నవీన్, సిద్ధు, ప్రవీణ్, బాలు, అభిలాష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


