epaper
Monday, March 2, 2026
epaper

అభివృద్ధి కాదు.. పేదలపై దాడి

అభివృద్ధి కాదు.. పేదలపై దాడి
కూరగాయల మార్కెట్ మూసివేతతో పేద‌ల‌కు అన్యాయం
ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో కూరగాయల మార్కెట్‌ను మూసివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మార్కెట్ మూసివేత అభివృద్ధి చర్య కాదని, పేద చిరు వ్యాపారస్తుల కడుపుపై చేసిన రాజకీయ దాడిగా ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ ఆరోపించారు.
గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముస్లిం మైనార్టీ పేద కూరగాయల వ్యాపారస్తుల కోసం అన్ని మౌలిక వసతులతో ఈ మార్కెట్‌ను నిర్మించి అందించారని గుర్తు చేశారు. ప్రజలు ఆ సేవలను మరిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు టెండర్ల పేరుతో షాపులను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రోజువారీ కూరగాయల వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్న అధికార పార్టీ నిర్ణయాలు అన్యాయమని పేర్కొన్నారు. నిజంగా కొత్త షాపుల అవసరం ఉంటే, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఇప్పటికీ అక్కడే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలపై దాడి చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని తాజుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ వ్యాపారం చేస్తున్న ముస్లిం మైనార్టీ వ్యాపారస్తులకు షాపులు దక్కకుండా నష్టం కలిగిస్తే, బీఆర్ఎస్ పార్టీ పక్షాన చిరు వ్యాపారస్తుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగర ప్రజలకు రోజువారీ కూరగాయలు అందిస్తూ జీవనం సాగిస్తున్న పేదలపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికిన తాజుద్దీన్, ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సేవలను ఖమ్మం ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img