epaper
Friday, April 17, 2026
epaper

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

మోంథా పంటనష్టం 1890 ఎకరాలు మాత్రమే

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా 6000 ఎకరాలు
చివరికి తేలిన పంట నష్టం1890 ఎకరాలు…
పంటలో 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతేనే సర్వేలో పేరు ఉన్నట్టు..
సోమవారం నాటికీ యాప్ లో ఎంట్రీతో సర్వే క్లోజ్..
మరింత గడువు పెంచాలని వేడుకుంటున్న రైతాంగం…

కాకతీయ, ఖానాపురం : మోంథా తుఫాను వల్ల ఖానాపురం మండలంలో ఈదురు గాలులతో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు చివరికి మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో 1890 ఎకరాలు మాత్రమే తేలినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాలు జిల్లా ఉన్నత అధికారులకు అందించినట్లు తెలిపారు. గత అక్టోబర్ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన మోంథా తుఫాన్ వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు పాకాల ఆయకట్టు పరిధిలో అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 30 వేల ఎకరాలకు గాను.. 6వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. నేలకొరిగిన వరి పంట నష్టాన్ని ఫీల్డ్ ద్వారా సర్వే చేపట్టిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు వరి పంటలో 33 శాతం దిగుబడి కంటే ఎక్కువ నష్టపోతేనే పరిగణలోకి తీసుకొని, చివరికి మండలంలోని 21 గ్రామపంచాయతీల్లో కేవలం 1890 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు, ఇట్టి పంటనష్ట సర్వేను యుద్ధ ప్రాతిపదికన నవంబర్ 10 తారీఖు నాటికీ ప్రభుత్వం సూచించిన యాప్ లో నమోదు చేసి పంట నష్ట సర్వేను ముగించినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటల్లో పత్తి, మొక్కజొన్న పంటలు లేకపోవడం గమనార్హం. తుఫాన్ కంటే ముందు యూరియా కొరతతో పంటల దిగుబడి తగ్గితే నేడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పత్తి మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి రైతులు అపార నష్టం వాటిల్లితే ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంటనష్ట గడువును మరిన్ని రోజులు పొడగించాలని కోరుతున్నారు.

పంట నష్ట సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించాం
– భోగ శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి

మొంథా తుఫాన్ వల్ల నేలకొరిగిన వరి పంటను పరిశీలించి పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించినట్లు తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలో 70 శాతం మేర పంట తీసినందున వాటిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img