విద్యార్థిని లావణ్యను సన్మానించిన సర్పంచ్
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని బడితండ గ్రామపంచాయతీకి చెందిన భూక్య వీరన్న కూతురు లావణ్య వరంగల్ కు చెందిన ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ సెకండియర్ 1000 మార్కులకు కు 982 ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని బడితండ సర్పంచ్ ధనమ్మ అమృ ఉప సర్పంచ్ చిట్టెమ్మ అన్నమయ్య లు. మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణంలో లావణ్యను శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి తండా గ్రామపంచాయతీ నుంచి ఉత్తమ ఫలితం సాధించినందుకు నెల్లికుదురు మండలానికి బడి తండ గ్రామానికి పేరు తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను గ్రామ పాలకమండలి, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకమండలి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


