epaper
Friday, April 17, 2026
epaper

రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు

రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కాకతీయ నెల్లికుదురు : రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గురుకుల పాఠశాల, రామన్నగూడెం గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో (255) కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందిస్తూ అన్ని వసతులు కల్పించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు,
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వెంట వెంటనే తరలించాలని, రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డబ్బులు త్వరగా రావడం కోసం నివేదికలు పంపాలన్నారు,
కేంద్రాలలో గన్ని సంచులు, తార్పాలిన్లు, మ్యాచ్చర్ మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, అందుబాటులో ఉంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ధాన్యం తరలింపు విషయంలో పూర్తి అవగాహన కల్పించాలని ఎఫ్ క్యూ నాన్స్ ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలనీ తద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చి లబ్ధి పొందుతారని సూచించారు,
ధాన్యం రవాణా విషయంలో వాహనాలను నిత్యం సిద్దంగా ఉంచుకోవాలని, హమలీలు, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,

వ్యవసాయ, సహకార, గిరిజన కార్పొరేషన్, డిఆర్డిఏ, ఐకెపి పౌరసరఫరాలు, తహసీల్దారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ జిల్లా లక్ష్యం విజయవంతంగా నిర్వహించి, కొనుగోలను పూర్తిచేయాలని సూచించారు,అలాగే ప్యాడి,పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని, పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ కొనుగోలను నిర్వహించాలని ఆదేశించారు.
కేజీబీవీ నీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు,
పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై అవగాహన కల్పించి సిబ్బంది షెడ్యూల్ ప్రకారం పై కార్యక్రమాలు నిర్వహించాలని, నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిహెచ్ నరేష్, ఆర్. ఐ రామకృష్ణ, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌

కిడ్నాప్ కేసుల‌కు నిందితుల‌కు రిమాండ్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా...

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు

వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల‌ శుభాకాంక్షలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం...

మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్...

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ

అదనపు డీజీపీ చారు సిన్హాతో సీపీ భేటీ కాకతీయ, హనుమకొండ : వరంగల్,...

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

వ‌చ్చే బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img