epaper
Thursday, January 15, 2026
epaper

డీసీసీల ఎంపిక తుది ద‌శ‌కు !

డీసీసీల ఎంపిక తుది ద‌శ‌కు !

ఢిల్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి..

మంత్రి ఉత్త‌మ్‌, పీసీసీ ఛీఫ్ మ‌హేష్‌గౌడ్ కూడా..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో నేత‌ల భేటీ

జిల్లా కాంగ్రెస్ సార‌థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు

త్వ‌ర‌లోనే తుది జాబితా ప్ర‌క‌ట‌న‌

ప‌ద‌వులు ఎవ‌రిని వ‌రిస్తాయోన‌ని ఆశావ‌హుల్లో ఉత్కంఠ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఉదయం రాజ‌ధానికి వెళ్లిన ఆయ‌న పార్టీ పెద్ద‌ల‌తో స‌మావేశం అయ్యారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన తుది కసరత్తులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్‌ కమిటీలకు అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఇటీవల జిల్లా పర్యటనలు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. వర్గాల వారీగా ఒక్కో కమిటీకి ఆరుగురితో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాటిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సీఎం రేవంత్‌, భట్టి, మహేశ్‌ గౌడ్‌, మీనాక్షి.. తమ అభిప్రాయాలు వినిపించారు. 39 జిల్లాలతోపాటు పట్టణ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆమోద ముద్ర తర్వాత ఈ నెలాఖరుకు తుది జాబితా ప్రకటించ‌నున్నారు.

వారికి ప‌ద‌వులు రావు

సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు. కనీసం ఐదు ఏళ్లు పార్టీలో పని చేసి ఉండాలన్న నిబంధన ఉందని, ఇవాళ అధిష్ఠానం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు తన అభిప్రాయం తీసుకుని లిస్ట్‌ ఫైనల్‌ చేస్తుందని, సామాజికన్యాయం ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వరాదనే నియమం ఉందన్నారు. అలాంటి వారికి ఈ పదవి రాదు అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

కొత్త ఉత్సాహం

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. తమ రిపోర్టులను రెడీ చేసి అధిష్టానానికి అందజేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్‌ను ఇచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు అందించిన ఈ రిపోర్టుల ఆధారంగానే డీసీసీ పదవులు ఖరారు కానున్నాయి. ఈ రిపోర్టులపై లోతైన విశ్లేషణ, చర్చ అనంతరం తుది నిర్ణయానికి రానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థాగత నియామకాలు జరుగుతున్నాయి. ఈ నియామకాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఎంతో ముఖ్యమైనది. ఇది పార్టీ యంత్రాంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img