epaper
Thursday, January 15, 2026
epaper

విద్యావిధానంలో సమూల మార్పులతోనే పేదరిక నిర్మూలన : సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యావిధానంలో సమూల మార్పులు ప్రక్షాళన అవసరం ఉందని మా ప్రభుత్వం నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలనకు దోహదం చేయడంతో పాటు, పిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేసేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యకు బలమైన ఆధారం అయి నిలిచినా, ఓపెన్ మార్కెట్ కారణంగా మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోలడం లేదని వ్యాఖ్యానించారు.

ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా, వారిలో కేవలం 15 శాతం మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోతుండగా, విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయించినా అందులో 98 శాతం జీతాలకే ఖర్చవుతోందని వివరించారు. పేదరికాన్ని నిర్మూలించే ఏకైక మార్గం విద్యే అని, అందుకే విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని సీఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 73 లక్షల యువతకు మంచి భవిష్యత్తు అందించడం తమ లక్ష్యమని, కొత్త విద్యా విధానం దేశ విద్యా వ్యవస్థనే మార్చేలా ఉండాలని ఆయన అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లో అనేక లోపాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది, 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని గణాంకాలను వెల్లడించారు.

విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్.ఆర్.బీ.ఎం (FRBM) పరిమితుల నుంచి మినహాయించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాలని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే, దాని కోసం రాజకీయపరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img