epaper
Monday, March 2, 2026
epaper

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట: యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు. శుక్రవారం ఖానాపురం మండలంలోని మంగళవారిపేట ,గొల్లగూడెంతండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో జాప్యం చేస్తున్న ఖానాపురం మండల వ్యవసాయ అధికారినీ తక్షణమే సస్పెండ్ చేయాలని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారుల పైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

గొల్లగూడెం తండాకు చెందిన రైతుకుటుంబం తేజవత్ శ్రీను స్రవంతిల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక , పశువులను మేపడంతో పంట నష్టపోయిన లావుడియా రాము లలిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పంటను పరిశీలించారు. యూరియా కొరత వలన గిరిజనులతోపాటు సన్న చిన్న కారి రైతుల యొక్క పత్తి, వరి, మొక్క జొన్న, పంటలు పూర్తిగా ఎర్రబడి పోతున్నాయి. పశువులను మేపే దుస్థితి వచ్చిందని, దీనికి ముమ్మాటికీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు నైతిక బాధ్యత వహించాలని అన్నారు.

పంటలకు పెట్టుబడి మొత్తం పూర్తయినదని, కోత దశ ఏరుకునే దశకు వచ్చింది, ఒక యూరియా బస్తా దొరికితే ప్రతి ఎకరానికి లక్షల రూపాయల విలువచేసే వివిధ పంటల దిగుబడి రైతుల చేతికి వచ్చేటువంటి చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల నుండి పదిసార్లు లైన్ లో నిలబడ్డ అస్వస్థకు గురైన భార్య ,పిల్లలతో, చిన్నపిల్లలతో, భుజాన ఎత్తుకొని లైను నిలబడ్డప్పటికీ కూడా యూరియా కరువైందని, ఇది ముమ్మాటికి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు 3 పంటల సంబంధించి ఎకరాకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని లేని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట నియోజకవర్గం లో తీవ్రమైన నిరసనలు ఉంటాయని ప్రభుత్వంన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని, ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా కూడా లేదు మీకు తప్పించుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు RFOR పట్టాలు ఇచ్చారని, సకాలంలో రైతుబంధు ఇవ్వడంతో పంట పెట్టుబడికి అంది దిగుబడి వచ్చిందిని, మద్దతు ధరకు కొనుగోలు చేశారని కానీ ప్రస్తుతం అన్ని కోల్పోయి రైతులు బజార్న పడే పరిస్థితి వచ్చిందన్నారు.

రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందిని, తీవ్రమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు మనోధైర్యం కోల్పోకుండా పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రతి పంటకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని, తీవ్రమైన నిరసనలకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సయ్య, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img