epaper
Saturday, November 15, 2025
epaper

రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు

రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కాకతీయ నెల్లికుదురు : రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గురుకుల పాఠశాల, రామన్నగూడెం గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో (255) కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందిస్తూ అన్ని వసతులు కల్పించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు,
కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వెంట వెంటనే తరలించాలని, రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి డబ్బులు త్వరగా రావడం కోసం నివేదికలు పంపాలన్నారు,
కేంద్రాలలో గన్ని సంచులు, తార్పాలిన్లు, మ్యాచ్చర్ మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, అందుబాటులో ఉంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ధాన్యం తరలింపు విషయంలో పూర్తి అవగాహన కల్పించాలని ఎఫ్ క్యూ నాన్స్ ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలనీ తద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చి లబ్ధి పొందుతారని సూచించారు,
ధాన్యం రవాణా విషయంలో వాహనాలను నిత్యం సిద్దంగా ఉంచుకోవాలని, హమలీలు, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,

వ్యవసాయ, సహకార, గిరిజన కార్పొరేషన్, డిఆర్డిఏ, ఐకెపి పౌరసరఫరాలు, తహసీల్దారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ జిల్లా లక్ష్యం విజయవంతంగా నిర్వహించి, కొనుగోలను పూర్తిచేయాలని సూచించారు,అలాగే ప్యాడి,పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని, పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటూ కొనుగోలను నిర్వహించాలని ఆదేశించారు.
కేజీబీవీ నీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు,
పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై అవగాహన కల్పించి సిబ్బంది షెడ్యూల్ ప్రకారం పై కార్యక్రమాలు నిర్వహించాలని, నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిహెచ్ నరేష్, ఆర్. ఐ రామకృష్ణ, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img