epaper
Tuesday, April 14, 2026
epaper

మంత్రాల నెపంతో యువకుడిపై ‘సుపారీ’ దాడి!

మంత్రాల నెపంతో యువకుడిపై ‘సుపారీ’ దాడి!
​రూ.5 వేల కోసం కిరాతకం.. వీడియో తీస్తూ పైశాచికానందం
​24 గంటల్లోనే కేసు ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు
ఐదుగురు నిందితుల అరెస్ట్

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన సురేష్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. మంత్రాల నెపంతో ఒక యువకుడిని హతమార్చడానికి ఐదు వేల రూపాయల సుపారీ ఇచ్చి దాడి చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఎఎస్పీ శుభం ప్రకాష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ​ఎస్.ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తాళ్ళపెళ్లి రాములమ్మ అనే మహిళ తన కూతురు ఇటీవల మరణించడానికి సురేష్ చేసిన మంత్రాలే కారణమని అనుమానించింది. ఎలాగైనా అతడిని అంతం చేయాలని భావించిన రాములమ్మ, పాత నేరస్థుడైన కళ్యాణ్‌కు రూ. 5,000 సుపారీ ఇచ్చి సురేష్‌ను చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది.

​కోటిలింగాల గుడి వద్ద కిరాతకం
​పథకం ప్రకారం.. నిందితులు కళ్యాణ్, జగన్ కలిసి సురేష్‌ను ఇంటి సమీపంలోని కిరాణా షాపు వద్ద బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కోటిలింగాల గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సురేష్‌పై బండరాయితో తలపైన, శరీరంపైన బాదుతూ కిరాతకంగా దాడి చేశారు. ఈ దారుణాన్ని నిందితుడు జగన్ తన మొబైల్‌లో వీడియో చిత్రీకరించాడు. సురేష్ ప్రాధేయపడుతున్నా వినకుండా కాళ్లతో తన్నుతూ పైశాచిక ఆనందం పొందారు.

​చనిపోయాడనుకొని ఇంటి వద్దే వదిలేసి
​తీవ్రంగా గాయపడిన సురేష్ స్పృహ కోల్పోవడంతో, అతడు చనిపోయాడని నిందితులు భావించారు. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించకుండా, ధైర్యంగా ఒక ఆటోలో వేసుకుని వచ్చి సురేష్ ఉంటున్న గల్లీలోనే పడేసి పరారయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ​పోలీసులు రంగంలోకి దిగి నిందితులు చిత్రీకరించిన వీడియో ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. తాళ్ళపెళ్లి రాములమ్మ, కళ్యాణ్, జగన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాడికి వాడిన ఆటో, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులపై గతంలోనే ఏనుమాముల, గీసుగొండ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు ఎఎస్పి తెలిపారు. ​ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎఎస్పి శుభం ప్రకాష్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఈ ఎన్ టి ఆసుపత్రిలో వివాదం

ఈ ఎన్ టి ఆసుపత్రిలో వివాదం వైద్యం వికటించడంతో బాధిత మహిళ రోగికి...

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య

పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చర్య కాకతీయ, హనుమకొండ : అక్రమంగా నిల్వ...

రైతులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు మొక్కజొన్న కొనుగోలు...

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ.. అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై...

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు...

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్ కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని...

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్...

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం దుగ్గొండి ఎస్సై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img