epaper
Friday, April 17, 2026
epaper

కాంగ్రెస్ హామీలపై ప్రజలు ఆలోచించాలి

కాంగ్రెస్ హామీలపై ప్రజలు ఆలోచించాలి
ఇచ్చిన మాటలు అమలు కాలేదు
కారు గుర్తుకే ఓటేయాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కాకతీయ, జమ్మికుంట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా ఆలోచించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. జమ్మికుంట పట్టణంలోని అబాది జమ్మికుంట గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వార్డు స్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది” అని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుబంధు, తులం బంగారం, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, బతుకమ్మ చీరలు వంటి హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా బకాయిల పాలనగా మారిందని, రైతుబంధు, వడ్ల బోనస్, ఫీజు రీయింబర్స్‌మెంట్, షాదీ ముబారక్, పెన్షన్లు తదితర చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం ఘోర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను వారి హామీలపై ప్రజలు ప్రశ్నించాలని, మాయమాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జమ్మికుంటలో నిర్వహించిన 13, 14వ వార్డుల సమావేశాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. తెలంగాణను కాపాడుకోవాలంటే, జమ్మికుంట అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుదీర్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img