epaper
Friday, April 17, 2026
epaper

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం
మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్
మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ భూమి విద్యుత్ శాఖకు కేటాయింపుపై ఆగ్ర‌హం

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తూ నగర అభివృద్ధికి చేపట్టిన పనులను ఇప్పుడు అధికారులు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ను ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించామని, కానీ ఇప్పుడు అదే పార్క్‌లోని 4 గుంటల భూమిని విద్యుత్ శాఖకు కేటాయించడం నగర అభివృద్ధి ఆత్మను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండానే పార్క్ భూమిని మరో శాఖకు కేటాయించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన అని అన్నారు. చట్టంలో ఎక్కడా కూడా పార్క్‌లలోని భూములను ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదని, స్మార్ట్ సిటీ కింద ఉన్న భూములను కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. పార్క్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని పలు పార్క్ స్థలాలను కమ్యూనిటీ హాళ్లు, యూత్ క్లబ్బులుగా మార్చడం కూడా అదే ధోరణిలో జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిల్ లేకుండా, ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయల చొప్పున వసూలు చేయడం ప్రజలపై భారీ భారం మోపటమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్లు ఉండగా నెలకు 60 లక్షలకుపైగా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది ప్రజాపాలన పేరుతో జరుగు ఇష్టానుసార పాలనకే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు పన్నులు చెల్లిస్తుండగా శానిటైజేషన్ పేరుతో మళ్లీ కొత్తగా వసూళ్లు ప్రారంభించడం అర్థరహితమని ప్రశ్నించారు. కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ జ్యోతిబాపులే పార్క్ 4 గుంటల భూమిని ఎలా కేటాయించగలిగారు అని ప్రశ్నించిన ఆయన వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని, శానిటైజేషన్ పేరుతో జరుగుతున్న వసూళ్లను నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ నగర మేధావులు, బుద్ధిజీవులు కూడా ఈ అంశంపై స్పందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్

డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పోటాపోటీ...

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన...

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి

ఎన్‌హెచ్-563 పనుల వేగం పెంచాలి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌కు ఎమ్మెల్యే స‌త్యం...

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో...

బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల...

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్...

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా...

జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img