హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం
హిందు మతంపై విమర్శలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు !?
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో బుధవారం బీజేపీ జిల్లా శాఖ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇతర మతాల మెప్పుకోసం హిందూ దేవుళ్లను హేళనగా ప్రస్తావించారని విమర్శించారు. మూడు కోట్ల దేవతలను లక్ష్యంగా చేసుకుని సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ “హిందుగాళ్లు – బొందుగాళ్లు” అన్న వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా సమాజం కఠినమైన తీర్పు ఇచ్చిందని, నేడు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే స్థితికి చేరిందని గుర్తుచేశారు. అదే బాటలో సీఎం రేవంత్ కూడా నడుస్తున్నారని, హిందూ సమాజంతో విభేదాలు పెంచుకుంటే కేసీఆర్ లాంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు.హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం చూపిన సీఎం, అదే స్థాయిలో ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడగలరా? అంటూ గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి ముందు కొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కూడా గంగాడి కృష్ణారెడ్డి ఇదే ఆరోపణలు పునరుద్ఘాటించారు.కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, వాసాల రమేష్, కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్, కటకం లోకేష్, పాదం శివరాజ్, బండారు గాయత్రి, తణుకు సాయి కృష్ణ, అవదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, ఆవిడల చైతన్య, నాంపల్లి శ్రీనివాస్, ప్రసన్న, యువ క్రాంతి, అక్షయ్, కట్ట రాజు, ప్రసాద్, బోయిన్ శ్రీను, జి.రవి, అనిష్, పాశం తిరుపతి, ఆకుల నరేష్, అజయ్, వెంకటేష్, సందీప్, శ్రీధర్, అనిల్, విజయ్, కలికోట మోహన్, నారాయణ, జిత్తు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


