epaper
Monday, March 2, 2026
epaper

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి
బీజేపీ మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొడుతోంది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలను విజయవంతం చేయాల‌ని పిలుపు

కాకతీయ, గోదావరిఖని : దేశంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్దిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలు చారిత్రాత్మకమని, ఈ సందర్భంలో కమ్యూనిస్టు శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. భాస్కర్ రావు భవన్‌లో ఎఐటియుసి అర్జీ–1 బ్రాంచ్ నిర్వహించిన కార్మిక కుటుంబాల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో వందేళ్లుగా ప్రజల మధ్య నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రజా స్రవంతిలోకి వచ్చి ఎడమపక్ష ఐక్యతకు సహకరించాలని సూచించారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న అణచివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.1942లో స్థాపించబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఎన్నో మైలురాయి పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. శేషగిరిరావు, మఖ్దూం, సర్వదేవబట్ల రామనాథం, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భాస్కరరావు, కత్తుల కొమురయ్య, చంద దుర్గయ్య వంటి నాయకుల త్యాగాలు సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.యూనియన్ శ్రేణులు పార్టీతో మమేకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి బలాన్ని చాటాలని సూచించారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అభ్యుదయవాదులను అణచివేస్తోందని విమర్శించారు.సమ్మేళనంలో పాల్గొన్న వందకు పైగా కార్మిక కుటుంబాలను సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడం సమయానుసారమని కూనంనేని స్పష్టం చేశారు.ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికులు పొందిన ప్రతి హక్కుకూ ఎఐటియుసి పోరాటమే మూలమని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఒకే వేదికపైకి తేవడం గోదావరిఖని చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. మహిళలు పార్టీ–యూనియన్ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల విప్లవ గేయాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img