epaper
Thursday, January 15, 2026
epaper

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి

కమ్యూనిస్టులంతా ఏకం కావాలి
బీజేపీ మ‌తోన్మాదాన్ని రెచ్చ‌గొడుతోంది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలను విజయవంతం చేయాల‌ని పిలుపు

కాకతీయ, గోదావరిఖని : దేశంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్దిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవాలు చారిత్రాత్మకమని, ఈ సందర్భంలో కమ్యూనిస్టు శక్తులన్నీ ఐక్యంగా ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. భాస్కర్ రావు భవన్‌లో ఎఐటియుసి అర్జీ–1 బ్రాంచ్ నిర్వహించిన కార్మిక కుటుంబాల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో వందేళ్లుగా ప్రజల మధ్య నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి ప్రజా స్రవంతిలోకి వచ్చి ఎడమపక్ష ఐక్యతకు సహకరించాలని సూచించారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న అణచివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.1942లో స్థాపించబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఎన్నో మైలురాయి పోరాటాలు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. శేషగిరిరావు, మఖ్దూం, సర్వదేవబట్ల రామనాథం, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు యూనియన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భాస్కరరావు, కత్తుల కొమురయ్య, చంద దుర్గయ్య వంటి నాయకుల త్యాగాలు సింగరేణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.యూనియన్ శ్రేణులు పార్టీతో మమేకమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి బలాన్ని చాటాలని సూచించారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అభ్యుదయవాదులను అణచివేస్తోందని విమర్శించారు.సమ్మేళనంలో పాల్గొన్న వందకు పైగా కార్మిక కుటుంబాలను సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడం సమయానుసారమని కూనంనేని స్పష్టం చేశారు.ఎఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికులు పొందిన ప్రతి హక్కుకూ ఎఐటియుసి పోరాటమే మూలమని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ డిసెంబర్ 26 ఖమ్మం శతాబ్ది సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఒకే వేదికపైకి తేవడం గోదావరిఖని చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. మహిళలు పార్టీ–యూనియన్ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని సూచించారు.కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల విప్లవ గేయాలు సభలో ఉత్సాహాన్ని నింపాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img