లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు
టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు
కాకతీయ, వెబ్డెస్క్ : మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్నుఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోతున్న రాజేష్ను, చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాకాయలు కాల్చి గ్రామ ప్రజలు సంబురాలు చేసుకున్నారు.


