epaper
Friday, April 17, 2026
epaper

రైతులకు సూపర్‌ డూపర్‌ న్యూస్.. ఒకేసారి బ్యాంక్‌ అకౌంట్లోకి రూ.18వేలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6వేల ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అంటే ఈ మొత్తం నేరుగా రైతులు బ్యాంకు అకౌంట్లో జమ అవుతోంది. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను 2వేల చొప్పున జమ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ను చూద్దాం.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో 11వ విడత తర్వాత పీఎం కిసాన్ నుంచి ఎలాంటి డబ్బు అందని రైతులు దాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి మోదీ ఈ నెల ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడతను విడుదల చేశారు. అందువల్ల వాయిదా డబ్బులు రాకుండా నిలిచిపోయిన రైతులు డేటాను సరిదిద్దడం వల్ల 12 నుంచి 20వ విడత వరకు 18వేలు పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని పత్రాలను మళ్లీ ధ్రువీకరించుకోవాలి. ఆధార్ సీడింగ్, ఈకెవైసీ, ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ చెప్పారు. ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను వారికి ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వాయిదాల జారీ ఆగిపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు. 2022 ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇచ్చిన 12వ విడతలో రైతులు తప్పనిసరిగా భూమిలో విత్తనాలు వేశారని రుజువు చూపించాల్సి వచ్చింది. ఆ తరువాత, 2022 డిసెంబర్ నుండి 2023 మార్చి మధ్య ఇచ్చిన 13వ విడతలో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానంను అమలు చేశారు. 2023 ఏప్రిల్ నుండి జూలై వరకు వచ్చిన 15వ విడతలో అయితే e-KYC తప్పనిసరి చేశారు.

ఈ కొత్త సాంకేతిక విధానాల వలన, కొన్ని రాష్ట్రాల్లో రైతుల సంఖ్య తాత్కాలికంగా తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయానికి పూర్తికాకపోయిన రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించిందని స్పష్టం చేసింది. అయితే, తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో మాత్రం రైతులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కోలేదని అధికారులు తెలిపారు.

రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాలోకి చేరేలా ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానాన్ని అనుసరిస్తోంది. దీని కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా ధృవీకరించబడిన రైతుల వివరాలను PM-Kisan పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.

పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సాంకేతిక సవరణలు చేసింది. ఇందులో ముఖ్యంగా :

PFMS, UIDAI, ఆదాయపు పన్ను శాఖల డేటాను కలపడం,

రైతుల వివరాలను రేషన్ కార్డ్ డేటాబేస్‌తో సరిపోల్చడం,

మరణించిన వారి ఆధార్ నంబర్లను నిలిపివేయడం,

డూప్లికేట్ లేదా నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించడం వంటి చర్యలు ఉన్నాయి.

ఈ మార్పుల వలన పథకం ద్వారా సహాయం నిజంగా అర్హులైన రైతులకే చేరేలా ప్రభుత్వం నిబంధనలు కట్టుదిట్టం చేసింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్

అమెజాన్ నుంచి ఏఐ ఫోన్ అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్...

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్!

డాలర్ దెబ్బకు గోల్డ్ స్లిప్! ప‌డిపోతున్న బంగారం ధ‌ర‌లు డాలర్ బలపడటమే ప్రధాన కారణం వడ్డీ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలనం తప్పుడు పెట్టుబ‌డుల‌ను ప్రొత్స‌హించిన అధికారుల‌పై కొర‌డా ముగ్గురు అధికారుల‌పై వేటు...

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img