epaper
Friday, April 17, 2026
epaper

ట్రంప్ టారిఫ్ వేళ కలిసిపోయిన ఇండియా చైనా.. సరిహద్దు వివాదం ముగిసినట్లేనా?

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ చైనాల మధ్య దాదాపు 5ఏళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరచుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, టిబెట్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఈ పాస్ లు తెరుచుకున్న విషయాన్ని అధికారికంగా తెలిపాయి. ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వాంగ్ యిూ, జైశంకర్ న్యూఢిల్లీలో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా తెరచుకున్న మార్గాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ది షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్ లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ ఉన్నాయి. 2020లో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీటిని మూసివేశారు. ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నా..సరిహద్దు ఘర్షణలు, దీర్ఘకాలికంగా ఉన్న సైనిక ఉద్రిక్తతలతో అవి మళ్లీ తెరచుకోలేదు. ఈ ట్రేడ్ పోస్టులు ఇరువైపులా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు వాడుకుంటారు. ఈ మార్గాలు చైనా వైపు షిగాట్సె, లాసా, న్యింగ్చిలను చేరుతాయి. నిజానికి ఈ మార్గాల్లో వాణిజ్యం మే నవంబర్ మధ్యలో జరుగుతుంది. వాస్తవానికి ద్వైపాక్షిక వాణిజ్యానికి భిన్నంగా ఈ మార్గాల్లో జరిగే వ్యాపారంలో భారత్ ఎక్కువ ఎగుమతులతో లబ్ది పొందింది.

ఈ మూడింటిని నాథులా పాస్ అత్యంత రద్దీగా ఉండే మార్గమని చెప్పవచ్చు. రాకపోకలు, వాణిజ్యం అత్యధికంగా దీని నుంచే జరుగుతుంది. సిక్కిం టిబెట్ ల మధ్య బలమైన వాణిజ్యానికి కూడా కారణం ఇదే. 2016లో ఈ మార్గం నుంచి అత్యధికంగా రూ. 82.6కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఆ తర్వాత మళ్లీతగ్గింది. షిప్కిలా పాస్ నుంచి వాణిజ్యం పరిమితంగానే జరుగుతోంది. ఇది భారత్ లోని నేషనల్ హైవే 5కు అనుసంధానమైన ఉంది. దీనికి రెండు వైపులా కస్టమ్స్ ఔట్ పోస్టులున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వాణిజ్యం జరగలేదని చెప్పాలి. లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్ లోని పిథోర్ ఘడ్ కు అనుసంధానమై ఉంటుంది. ఈ మార్గంలో రహదారి సౌకర్యం అంత అనువుగా ఉండదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img