epaper
Friday, April 17, 2026
epaper

అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ.. అడ్డంగా బుక్కయినట్లేనా..?

కాకతీయ, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయనపై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూ కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ వసూళ్లలో ఆయన పాత్ర ఉందని ఫిర్యాదులు వచ్చాయి. ఒక ఎకరా భూమిని రూ.10 లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మారని, భూ కన్వర్షన్ కోసం ఎకరాకు రూ.5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని ఒక వైసీపీ నేత నేతృత్వంలో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. అంతేకాకుండా కొండమోడు ప్రాంతంలోని ముగ్గురాయి వ్యాపారుల నుంచి గత ఐదేళ్లలో సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు చెబుతున్నాయి.

విద్యుత్ శాఖలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను ఒక్కొక్కదాన్ని రూ.7 లక్షల ధరకు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం అంబటి రాంబాబు మంత్రిత్వ కాలానికి సంబంధించిందని ఆరోపణలు చెబుతున్నాయి.

ఇక వైసీపీ మాత్రం దీనిని రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు ప్రతీరోజూ జరుపుతున్న మీడియా సమావేశాల వల్ల అసహనం చెంది, ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, టీడీపీ, కూటమి నేతలు మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ హయాంలో అవినీతి చేసిన వారందరికీ విచారణ తప్పదు. ఫిర్యాదులు ఉన్నందువల్లే విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందని వారు చెబుతున్నారు.

అంబటి రాంబాబు కూడా ఇప్పటికే ఆరోపణలపై స్పందించారు. తనపై మోపబడుతున్నవి అసత్య ఆరోపణలేనని, రాజకీయ కారణాల వల్లే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. అయినప్పటికీ, విచారణలో అక్రమాలు నిరూపితమైతే కేసు తీవ్రంగా ముదిరే అవకాశం ఉంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ ఏ దిశగా సాగుతుందో, ఫలితం ఏమిటో అన్నదానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలంతా దృష్టి సారించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంపై విజిలెన్స్‌ దాడులు రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న అధికారులు కార్యాల‌యం అష్ట‌దిగ్బంధ‌నం.....

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా

కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా సంఘ కార్యాలయ ఫ్యాన్ల పేరిట కార్మికుల నుంచి...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

పారిశుధ్య కార్మికులపై పెత్తనం

పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండ‌కం సెలవులు ఇవ్వకుండా...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం

మార్కాపురంలో ఘెర‌ బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు...

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం.. భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య మూడు రోజుల వ్యవధిలో దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img