epaper
Thursday, January 15, 2026
epaper

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా?
గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు
విమాన గోపురం బంగారు తాపడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు
100 కిలోల బంగారంలో సగం మాయమైందన్న ఫిర్యాదులు
9 పొరల బదులు 2 పొరలతోనే పనులు పూర్తి చేసినట్లు అభియోగం
టీటీడీ విజిలెన్స్ గోప్య విచారణ… జనసేన ఆందోళన

కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీటీడీపై ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2022–23 మధ్యకాలంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ పనుల కోసం సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించడంతో పాటు 4,300 కిలోల రాగిని వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. గోపురానికి 9 పొరల బంగారు తాపడం చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం 2 పొరలతోనే పనులు ముగించి దాదాపు 50 కిలోల బంగారాన్ని మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల కాంట్రాక్టును జ్యోతి అనే మహిళ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఆమె స్వయంగా పనులు చేయకుండా ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్యమతస్తులైన సయ్యద్ కరీం, రహంతుల్లాకు పనులు అప్పగించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ విమాన గోపురం వంటి పవిత్ర పనులను ఇలా సబ్‌లీజ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది.

విగ్రహాల ధ్వంసంపై ఆవేదన
బంగారు తాపడం పనుల సమయంలో గోపురంపై ఉన్న 30కి పైగా పురాతన దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అప్పట్లోనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. విగ్రహాల ధ్వంసం అనంతరమే తాపడం పనులు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
విమాన గోపురం పనులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. అసలు కాంట్రాక్టర్, సబ్‌కాంట్రాక్టర్లు, పనులు చేసిన కార్మికులను విచారిస్తూ ఎంత బంగారం వినియోగించారన్న అంశంపై ఆరా తీస్తోంది. అయితే ఈ విచారణ అంతా అత్యంత గోప్యంగా సాగుతుండటంతో ఇప్పటివరకు టీటీడీ అధికారికంగా స్పందించలేదు.

జనసేన ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వామివారి ఆస్తులను స్వాహా చేశారంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీటీడీ ఇచ్చిన 100 కిలోల బంగారంలో సగం మాయమైందని, బంగారం బదులు గోల్డ్ కలర్ పెయింట్ మాత్రమే వేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. బంగారు తాపడం పేరుతో వాడిన బంగారం నిజమైనదేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. శ్రీవారికి అన్నగా భావించే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన ఈ ఆరోపణలు భక్తుల్లో తీవ్ర కలవరం రేపుతున్నాయి. విజిలెన్స్ విచారణలో వాస్తవాలు బయటపడాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు శ్రీశైలం వెళ్తున్న ఘ‌ట‌న‌... దోర్నాల ఫారెస్ట్...

మారేడిమిల్లిలో ఘెర ప్ర‌మాదం.. 15 మంది మృతి

మారేడిమిల్లిలో ఘెర ప్ర‌మాదం.. 15 మంది మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో :...

పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’

పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’ పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక...

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని...

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img