epaper
Thursday, January 15, 2026
epaper

Heavy Rains: రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులు దంచికొట్టనున్న వర్షాలు..!!

కాకతీయ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక సూచన చేసింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడరాదు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండరాదు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చని వివరించింది.

ఇప్పటికే ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మిల్లీమీటర్లు, పెద్దకూరపాడులో 40.2 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముక్కామలలో 39 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అధికారులు ప్రజలకు సూచిస్తూ వర్షాల సమయంలో అవసరం తప్ప బయటకు వెళ్లరాదని, వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు పొలాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని APSDMA స్పష్టం చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు

అదుపుత‌ప్పిప లోయ‌వైపు దూసుకెళ్లిన టూరిస్టు బ‌స్సు శ్రీశైలం వెళ్తున్న ఘ‌ట‌న‌... దోర్నాల ఫారెస్ట్...

మారేడిమిల్లిలో ఘెర ప్ర‌మాదం.. 15 మంది మృతి

మారేడిమిల్లిలో ఘెర ప్ర‌మాదం.. 15 మంది మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో :...

పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’

పండుగ వాతావరణంలో ‘విలువల విద్యాసదస్సు’ పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక...

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img