50వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ను క్లీన్ డివిజన్గా మార్చి ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. చెత్త సేకరణ కోసం 50వ డివిజన్కు నూతన ట్రాక్టర్ కేటాయించిన సందర్భంగా శనివారం ఆయన వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ట్రాక్టర్ కేటాయించిన నగర మేయర్, మున్సిపల్ కమిషనర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డివిజన్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు నిరంతరం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ప్రజలను కోరిన ఆయన రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. డివిజన్ను క్లీన్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల సహకారం, సూచనలతో డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తానని కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు.


