దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితం
కాకతీయ,చేర్యాల:దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్” ప్రణీత అన్నారు. బుధవారం చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో మండలంలోని ముస్త్యాల గ్రామంలో ఏడురోజుల శీతాకాల శిబిరాన్ని కళాశాల కో ఆర్డినేటర్ డాక్టర్ గంగయ్య ఆధ్వర్యంలో ప్రారంభం కాగా ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శ్రమించే తత్వం విద్యార్థులలో ఉండాలని అది ఈ శిబిరం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ రజిత విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ గ్రామంలో సేవ చేయడం అంటే సమాజానికి సేవ చేసినట్లేనని అన్నారు. మండల విద్యాధికారి నరేందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం సేవ చేయడం ఎంతో అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వాలంటీర్లు పాల్గొన్నారు.


