మరణానంతరం శరీరదానం
ఆర్ఎంపీ వైద్యురాలు అనూష ఆదర్శ నిర్ణయం
ప్రభుత్వ వైద్య కళాశాలకు శరీరం దానం చేసేందుకు అంగీకారం
సమాజ సృహకు నిదర్శనమని ప్రశంసలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఆర్ఎంపి వైద్యురాలు కొండూరి అనూష తన మరణానంతరం శరీరాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేయాలని కుటుంబ సభ్యుల సమక్షంలో లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపినట్లు ఝాన్సీ రాణి నేత్ర, అవయవ ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపకురాలు కమల రాణి కొచ్చెర్ల తెలిపారు. వైద్య విద్యార్థుల అధ్యయనం, ప్రయోగాలకు తన శరీరం ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని ఆమె అన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించడం గొప్ప విషయమని అభినందించారు. ఇలాంటి సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తులు సమాజానికి అవసరమని పేర్కొన్నారు. నేత్ర, అవయవ దానం చేయదలచిన వారు 8919569524 నంబర్ను సంప్రదించాలని కోరారు.


