ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి
*భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
*ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన చేర్యాల కౌన్సిలర్లు
కాకతీయ, చేర్యాల: చేర్యాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు శనివారం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలబొకేతో పాటు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. ప్రజల సమస్యలను పరిష్కారించే విధంగా కృషి చేయాలని, బాధ్యతయుతంగా పని చేయాలని కౌన్సిలర్లకు సూచించారు.ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, చేర్యాల పట్టణా అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి దిశానిర్దేశం చేశారు. ఎంపీ ని కలిసిన వారిలో కౌన్సిలర్లు కొమ్ము రాజేశ్వరి -నర్సింగ రావు,పోతుగంటి ప్రసాద్, వెలుగల దుర్గయ్య, షరీఫా బేగం-ఖాజాతో పాటు తదితరులు ఉన్నారు.


