ఆత్మకూరి జగదీష్ పై పీడీ యాక్ట్
రేషన్ బియ్యం దందాపై ఖమ్మం సీపీ సీరియస్ యాక్షన్
కాకతీయ,ఖమ్మం బ్యూరో : రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్ పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పేదలకు ఉచితంగా అందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట రాష్ట్రాలక తరలిస్తుండటంతో ఖమ్మం జిల్లాలో 13 కేసులు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో రెండు కేసుల్లో ప్రధాన నిందుతుడుగా వున్న ఖమ్మం నగరానికి చెందిన ఆత్మకూరి జగదీష్ పై శుక్రవారం పీడీ యాక్ట్ అమలు చేసి హైదరాబాద్ చంచలగూడ సెంట్రల్ జైలు తరలించడం జరిగిందన్నారు.దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడటంతో పీడీ యాక్ట్ను నమోదు చేసినట్లు తెలిపారు. పేదల కడుపు కొట్టే రేషన్ బియ్యం మాఫియాపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.


