epaper
Sunday, March 1, 2026
epaper

ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్

ఇక పాఠశాలల్లో పప్పులుడకవ్
నిధులు విధులపై ప్యానల్ టీం పర్యవేక్షణ
భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక
ప్రాథమిక స్థాయి నైపుణ్యాల పెంపు దిశగా కీలక చర్యలు
హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం పర్యవేక్షణ బాధ్యతలు
మూడు నెలల్లో వంద పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన
హాజరు, నిధుల వినియోగం, బోధన విధానాలపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త చర్యలు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో నిధుల వినియోగం, బోధన విధానాలు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్యానల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన విధానాలను మెరుగుపరచడం, నాణ్యమైన విద్య అందించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

భద్రాద్రి జిల్లాకు 48 మంది ఉపాధ్యాయుల ఎంపిక

ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొత్తం 48 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరిలో ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు ఉండగా, ప్రత్యేక బృందాలుగా నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అందించగా, అనంతరం జిల్లా వ్యాప్తంగా వారికి కేటాయించిన పాఠశాలలను పరిశీలించనున్నారు. ప్రతి బృందంలో ఒకరు నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షణ నిర్వహించనున్నారు.

పాఠశాలల పనితీరుపై సమగ్ర పరిశీలన

ప్రత్యేక బృందాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనితీరును సమగ్రంగా పరిశీలించనున్నాయి. మూడు నెలల వ్యవధిలో సుమారు 100 పాఠశాలలను తనిఖీ చేసి బోధన విధానం, నిధుల వినియోగం, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై నివేదికలను సిద్ధం చేయనున్నారు. విద్యార్థుల ప్రగతిని పెంపొందించే విధంగా కృత్యాధార బోధన అమలు, బోధనా సామగ్రి వినియోగం, తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. అవసరమైన చోట ఉపాధ్యాయులకు సూచనలు అందించి విద్యా ప్రమాణాల పెంపుకు మార్గనిర్దేశం చేయనున్నారు.

ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విధుల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానంతో పాటు, ఆకస్మిక తనిఖీల ద్వారా విధులకు గైర్హాజరు అయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పాఠశాలల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్యానల్ బృందాల పర్యవేక్షణ కీలకంగా మారనుంది. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా కాకతీయ, చింతకాని :...

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్...

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి అక్రమ రవాణాపై కేసులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img