పిచ్చి కుక్క స్వైర విహారం
కాకతీయ , కూసుమంచి : నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం వలన 8 మందిపై దాడి చేసింది . దగ్గరలో ఉన్న వారిపై దొరికిన వారిపై దొరికనట్లే కరుస్తు తీవ్రగాయాలపాలు చేసింది. పిచ్చికుక్క చేసిన దాడిలో ముజ్జుగూడెం గ్రామానికి చెందిన ఆరుగురి,ఆచార్లగూడెం గ్రామానికి చెందిన ఒకరిని, నేలకొండపల్లి గ్రామానికి చెందిన యువకుడి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానిక బిఆర్ఎస్ నాయకుడు ఉన్నం బ్రహ్మయ్య కు విషయం తెలియడంతో యువకులను పురమాయించి పిచ్చికుక్కను అదుపు చేసే క్రమంలో పరిస్థితి విషమించడంతో స్థానిక యువకులు కర్రలతో కొట్టి పిచ్చికుక్కను మట్టు పెట్టారు.. తీవ్ర గాయాలు పాలైన బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



