epaper
Sunday, March 1, 2026
epaper

కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ

కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ
చీకటి ఒప్పందాలు.. రైతులపై పోలీస్ బెదిరింపులు
మూడేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన సవాల్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై గత పాలకుల పాలనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఎండగట్టారు. కాళేశ్వరం లింక్–2 పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొని చీకటి ఒప్పందాలతో పనులు చేపట్టారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కరీంనగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినట్లు తెలిపారు.
2016లో జీవో నం.71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.136 కోట్లకు పెంచారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు ప్రారంభించారని అన్నారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీటి విషయంలో అప్పటి మంత్రులు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో ఒడ్డెర జాతి ప్రజలను పోలీసులతో బెదిరించి గుట్టను ఖాళీ చేయించారని, భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామని రైతులను బెదిరించిన ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేయడం తనకు చేతకాదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

ఆరు నెలల్లోనే ఫలితాలు

కేవలం ఆరు నెలల మంత్రిత్వ కాలంలోనే 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించామని, పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ మంత్రిగా దళిత బిడ్డలను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. తన రాజీనామాపై చర్చలు చేస్తున్నవారికి ఘాటైన సమాధానం ఇస్తూ, తాను రాజీనామా చేయాలా వద్దా అనేది ధర్మపురి ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో

గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, అయినప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్, బస్ డిపో తీసుకువస్తామని చెప్పారు. ట్రైబల్ మినిస్టర్ ద్వారా రూ.60 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని, వాడవాడ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
మూడేళ్లలో తాను ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనవరి చివరి వారం వరకు గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్మపురికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌,...

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిరిసిల్ల ఎస్పీ...

ఆవుల‌పై పులి దాడి

ఆవుల‌పై పులి దాడి మోత్కరావుపేట శివారులో అడుగులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చ‌రిక‌ కాకతీయ, రుద్రంగి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img