epaper
Friday, April 17, 2026
epaper

సానుభూతి ఓట్లకు కేటీఆర్ పాకులాట‌

  • గోపీనాథ్‌ మృతిపై త‌ల్లి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి
  • రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార‌శాఖ‌ మంత్రి పొంగులేటి

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌జ‌లకు చెందిన కోట్లాది రూపాయిల‌ను కొల్ల‌గొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించి ప‌బ్బం గడుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి, రెహ‌మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న బోర‌బండ డివిజ‌న్ తో స‌హా వివిధ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. బోర‌బండ‌లోని సాయిబాబాన‌గ‌ర్‌,జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ అసోసియేష‌న్ల స‌భ్యులు, ప‌లువురు అర్చ‌కులు మంత్రి పొంగులేటి స‌మ‌క్షంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్‌రెడ్డి, రెహ్మ‌త్‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ సి.ఎన్‌. రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ కండువాలు క‌ప్పి మంత్రి పొంగులేటి వారికి స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగ‌త మాగంటి గోపీనాథ్‌ విష‌యంలో కేటీఆర్ విల‌న్ అని సాక్షాత్తూ గోపీనాథ్‌ త‌ల్లిగారే ప్ర‌క‌టించార‌ని అన్నారు. గోపీనాథ్‌ మృతి ఓ మిస్ట‌రీ అని ఆమె చెప్ప‌డం చూస్తే క‌ల్వ‌కుంట్ల కుటుంబ వైఖ‌రి అంద‌రికీ అర్ద‌మ‌వుతుంద‌న్నారు. గతంలో వేలాది మంది తెలంగాణ యువ‌త‌ను ఉద్య‌మానికి ఆహుతిచ్చిన కేసీఆర్ త‌ర్వాతి కాలంలో ఎంద‌రో ఉద్య‌మ నాయ‌కుల‌ను పాతాళానికి తొక్కేశార‌ని గుర్తు చేశారు. తాజాగా క‌విత‌ను కూడా బ‌య‌ట‌కు పంపి కాళేశ్వ‌రంలో వ‌చ్చిన క‌మీష‌న్లలో వాటా ఇవ్వ‌కుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు.

క‌విత జాగృతి సంస్ధ కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు బిఆర్ఎస్‌కు ఈ ఎన్నిక‌ల్లో బుద్దిచెబుతార‌న్న ఆశాభావాన్ని మంత్రి గారు వ్య‌క్తం చేశారు. హీన రాజ‌కీయ చ‌రిత్ర‌క‌లిగిన కేసీఆర్ కుటుంబ రాజ‌కీయాల‌కు మాగంటి గోపీనాధ్ కుటుంబం ఇప్పుడు రోడ్డున ప‌డింద‌ని అన్నారు. గ‌తంలో ఆంధ్ర‌ప్రదేశ్ లో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన‌ప్పుడు ఇక్క‌డి సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు శాంతియుతంగా నిర‌స‌న తెలిపితే వారిని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయి ధ‌ర్నాలు చేసుకోమ‌న్న కేటీఆర్ ఇప్పుడు తెలుగుదేశం సానుభూతిప‌రుల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నార‌ని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించ‌లేక అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాట‌డం లేద‌ని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు నెల‌కు 23వేల క్వింటాళ్ల స‌న్న‌బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని దేశంలోనే ఇటువంటి ప‌ధ‌కం ఒక్క తెలంగాణ‌లోనే అమ‌లు చేస్తుండ‌గా ఈ బియ్యం పంపిణీని విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అవాకులు చ‌వాకులు మాట్లాడుతున్నార‌ని అన్నారు. స‌న్న‌బియ్యం పంపిణీ ఆపేస్తామంటూ కాంగ్రెస్ వారు ఎక్క‌డా ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా కేవ‌లం ఓట్ల రాజ‌కీయంతో బిజేపీ కిష‌న్ రెడ్డి అలా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి

క్వారీల్లో అద‌న‌పు వ‌సూళ్ల‌ను అరిక‌ట్టండి టీజీఎండీసీ ఎండీ భ‌వేశ్ మిశ్రాకు లారీ అసోసియేష‌న్...

రేవంత్ అబద్ధాల రాజకీయాలు

రేవంత్ అబద్ధాల రాజకీయాలు బ‌డ్జెట్ ప్ర‌సంగం సాక్షిగా బ‌య‌ట‌ప‌డ్డాయి అసెంబ్లీ వేదికగా సీఎం ప్రజలను...

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు

కార్పొరేట్ మహిళకు సైబర్ షాక్!.. రూ.1.20 కోట్లు గల్లంతు డైరెక్టర్ ఫోటోతో ఫేక్...

రైల్వే పరీక్ష కీ విడుదల

రైల్వే పరీక్ష కీ విడుదల పారా మెడికల్ పోస్టుల ప్రాథమిక ఆన్సర్ కీ...

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్

అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో...

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం

గ్యాస్ కొరతకు కేంద్రం నిర్ల‌క్ష్య‌మే కార‌ణం దౌత్య విధానం స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఇంధన...

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌

ఆదివాసిల‌కు కాంగ్రెస్‌లో పెద్ద‌పీట‌ వారి హక్కుల సాధ‌న‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది సామాజిక న్యాయం...

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్

రాజధానిలో టిఫిన్‌లకు బ్రేక్ గ్యాస్ కొరతతో దోశ, పూరి, వడ తాత్కాలికంగా బంద్ మూతపడుతున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img