కాకతీయ ఎఫెక్ట్…
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ లను పట్టుకున్న పోలీసులు..

కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలంలో ఇసుక దొంగలు మండలంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక రవాణా దందా అను కథనం బుధవారం ప్రచురించగా దృష్టి సారించిన పోలీసులు గురువారం రోజు రోజున వీనవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సంగి రాజు మరియు నేదురు కనుకయ్య అను వ్యక్తులు 2 ట్రాక్టర్ లు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా శంకరపట్నం మండలంలోని కాచపూర్ గ్రామ శివారులో పోలీసులు పట్టుకొని, స్టేషన్ కు తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ చర్యలు నామమాత్రమేనా శాశ్వత పరిష్కారమా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.


