epaper
Saturday, November 15, 2025
epaper

అయోధ్య, కాశీ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రత్యేక యాత్రలో అయోధ్య, కాశీ, పూరీ వంటి పవిత్ర ప్రదేశాలతో పాటు బైద్యనాథ్ ధామ్ వంటి ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది. అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ అనే పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ యాత్ర 2025 సెప్టెంబర్ 9న ప్రారంభమై మొత్తం 10 రోజులు సాగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ స్కీమ్ కింద నడిచే ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు కాజీపేట, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం స్టేషన్ల వద్ద నుంచి కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ క్లాస్, 3ఏసీ, 2ఏసీ తరగతులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 639 సీట్లు ఉంటాయి.

మొదటి రెండు రోజుల్లో భక్తులు పూరీ చేరుకుని జగన్నాథ స్వామి దర్శనం చేసుకోగలరు. మూడో రోజు కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. నాలుగో రోజు బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఐదో రోజు వారణాసికి బయలుదేరి ఆరో రోజు కాశీ విశ్వనాథ్ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించొచ్చు. సాయంత్రం గంగా హారతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

తర్వాత అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గఢి వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమై, సెప్టెంబర్ 18న యాత్ర సికింద్రాబాద్‌లో ముగుస్తుంది.

టికెట్ ధరలు కూడా ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టే నిర్ణయించారు. స్లీపర్ క్లాస్ ధర రూ.17,000, 3ఏసీకి రూ.26,700, 2ఏసీకి రూ.35,000గా నిర్ణయించారు. వసతి విషయానికొస్తే, ఎకానమీ క్లాస్ వారికి నాన్-ఏసీ గదులు 4-5 మందికి షేరింగ్‌లో, స్టాండర్డ్ క్లాస్ వారికి 2-3 మందికి నాన్-ఏసీ గదులు, కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ గదులు కేటాయిస్తారు. వాహన సౌకర్యం కూడా క్లాస్ ఆధారంగా ఉంటుంది.

భక్తులకు ప్రతిరోజూ ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. మొత్తం వెజిటేరియన్ ఆహారం మాత్రమే ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు వంటి సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. అయితే ఆలయ ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, గైడ్ ఫీజులు, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మినరల్ వాటర్ ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.భక్తుల సౌకర్యార్థం రైల్వేలు సుమారు 33 శాతం రాయితీ కూడా ఇస్తున్నాయి. ఈ యాత్రలో భాగమై పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే వారు పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img