epaper
Sunday, March 1, 2026
epaper

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”
ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరు
అమ‌ర‌వీరుల స్ఫూర్తితో విధులు కొన‌సాగించాలి
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి అవగాహన ఉన్నవారినే చైర్మన్ చేశాం
15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పోస్టులు భర్తీ
పదవితో వ్యక్తిత్వం కోల్పోవద్దు.. పాల‌న‌లో పారదర్శకత పాటిద్దాం
ప్రజలకు సంక్షేమం చేరేలా పని చేయాలి
గ్రూప్–1, గ్రూప్–2 అధికారులకు సీఎం భావోద్వేగ సందేశం
శిక్షణను పూర్తి చేసుకున్న అధికారులకు అభినంద‌న‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : గ్రూప్–1, గ్రూప్–2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగభరితంగా ప్రసంగించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అధికారులను అభినందిస్తూ “మీరు మొన్న విద్యార్థులు… నిన్న నిరుద్యోగులు… ఈ రోజు అధికారులు. ఇది మీ కృషి, మీ కుటుంబాల త్యాగాల ఫలితం” అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సేవ చేసే బాధ్యత మీ భుజాలపై ఉందని గుర్తుచేస్తూ పారదర్శకత, నిబద్ధత, కర్తవ్యబోధతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆకలిని సహించినా ఆధిపత్యాన్ని ఒప్పుకోరని స్పష్టం చేసిన సీఎం, స్వాతంత్ర్యం, స్వాభిమానం కోసం పోరాడిన వీరులను స్మరించారు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం కాదు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. కాకతీయ కాలంలో సమ్మక్క, సారలమ్మ సామాజిక న్యాయం కోసం తిరుగుబాటు చేసి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం అమరవీరులైన వారి స్ఫూర్తి అధికారుల పనితీరులో ప్రతిబింబించాలని సూచించారు. దేశంలో తొలి సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ బిడ్డ రావి నారాయణ రెడ్డిని ఉదాహరణగా పేర్కొంటూ ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షల కోసం సుమారు ఆరు లక్షల మంది పోటీపడగా 582 మంది గ్రూప్–1, 775 మంది గ్రూప్–2 అభ్యర్థులు మాత్రమే ఎంపిక కావడం సాధారణ విషయం కాదని, ఇది మీ ప్రతిభ, పట్టుదల ఫలితమని అభినందించారు.

15 ఏళ్ల తర్వాత గ్రూప్–1 భర్తీ

గత 15 ఏళ్లుగా గ్రూప్–1 పోస్టులు భర్తీ కాలేదని గుర్తుచేసిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఆ లోటును తీర్చిందన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్నవారినే చైర్మన్, సభ్యులుగా నియమించామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు. గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల ఆనందం నిలవకుండా కొందరు కోర్టులకు వెళ్లినా, ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు పోరాడి మెరిట్ ఆధారంగా ఎంపికలను నిలబెట్టిందన్నారు.
అధికారులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని సీఎం హెచ్చరించారు. పదవి వచ్చిన తర్వాత మనిషిగా పతనం కాకూడదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మీది అని స్పష్టం చేస్తూ “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు” అని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచిన ఎస్.ఆర్. శంకరన్‌ను తలచుకోవాలని సూచించారు. పేదలకు సహాయం చేసే ముందు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని, వారిని గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా చట్టం తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. త్వరలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఎంసీఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదరబోతుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిపాలన నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలను అధికారులు వినియోగించుకోవాలని సూచించారు. ముగింపులో, ప్రజల ఆశలు, అమరవీరుల స్ఫూర్తి, తల్లిదండ్రుల ఆశీర్వాదాలను గుర్తు పెట్టుకుని పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా సేవ చేయడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

వంద ప‌బ్లిక్ స్కూళ్లు

వంద ప‌బ్లిక్ స్కూళ్లు పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img