epaper
Thursday, January 15, 2026
epaper

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌.. నిర్మలా సీతారామన్ పేరుతో రూ. 99 ల‌క్ష‌లు దోపిడి!

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌.. నిర్మలా సీతారామన్ పేరుతో రూ. 99 ల‌క్ష‌లు దోపిడి!
దేశంలో కొత్తగా భయపెడుతున్న డిజిటల్ అరెస్ట్
పుణెలో రిటైర్డ్ మహిళను లక్ష్యంగా చేసుకున్న సైబర్ గ్యాంగ్‌
నిర్మలా సీతారామన్ న‌కిలీ సంతకంతో ఘ‌రానా మోసం

కాక‌తీయ‌, జాతీయం : సైబర్ నేరగాళ్లు కొత్త రూపంలో ప్రజలను మోసం చేస్తున్నారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో వ్యక్తులను కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి, ఒత్తిడికి గురిచేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లో ప్రధానంగా సైబర్ క్రిమినల్స్, ప్రభుత్వ అధికారులు లేదా ఏజెన్సీల పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి బాధితులను మోసం చేస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన రూ. 58 కోట్ల డిజిటల్ అరెస్ట్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా ఇటువంటి ఘ‌ట‌న మ‌రొక‌టి వెలుగు చూసింది. నిర్మలా సీతారామన్ పేరు చెప్పి రూ. 99 ల‌క్ష‌లు దోపిడి చేసేశారు సైబర్ నేరగాళ్లు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

పుణెలో నివసించే 62 ఏళ్ల మాజీ ఎల్‌ఐసీ అధికారిణికి ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతినిధినని న‌మ్మ‌బ‌లికాడు. ఆ వ్యక్తి, ఆమె ఆధార్ నంబర్‌కు అనుబంధంగా ఉన్న మొబైల్ నంబర్ ను మోసపూరిత లావాదేవీల్లో ఉపయోగించబడిందని, ఈ కేసు సంబంధంగా ఆమెపై విచారణ జరుగుతోందని భయపెట్టాడు. మీరు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు, మీరు సహకరించకపోతే ఆన్‌లైన్‌లో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరించిన నేరగాడు ఆమెను పూర్తిగా గందరగోళానికి గురిచేశాడు.

భయాందోళనలో ఉన్న ఆ మహిళ, నేరగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.99 లక్షలు బదిలీ చేశారు. తరువాత ఆ వ్యక్తిని సంప్రదించే ప్రయత్నం చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గుర్తించారు. వెంటనే పుణె సిటీ సైబర్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, పూర్తి వివరాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేయడానికి చర్యలు చేపట్టారు.

ఈ కేసులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, నేరగాళ్లు బాధితురాలిని నమ్మించే క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉన్న నకిలీ పత్రంను ఉపయోగించారు. దీనితో బాధితురాలు అది నిజమైన అధికార పత్రం అని నమ్మి, డబ్బు బదిలీ చేయడం జరిగింది. ఈ విధంగా, మోసగాళ్లు ఇప్పుడు కేంద్ర మంత్రుల పేర్లను కూడా వాడుతూ ప్రజల విశ్వాసాన్ని దోచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇటీవల ముంబైలో నిందితులు ఈడీ అధికారులుగా నటించి, న‌గ‌రానికి చెందిన వ్యాపారవేత్త వద్ద నుంచి రూ. 58 కోట్లు దోచుకున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సైబర్ మోసాలలో ఇదొకటి. ఈ మోసంలో హాంకాంగ్, చైనా, ఇండోనేసియా వంటి దేశాలకు చెందిన నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు

చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు నూతన విగ్రహం ప్రారంభానికి ముందు దుండ‌గుల దుశ్చ‌ర్య‌ రాయ‌ప‌ర్తి...

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య ఖమ్మంలో విషాద ఘటన.. మృతురాలి స్వ‌స్థ‌లం ఒడిశా కాకతీయ, ఖమ్మం...

భార్య గొంతు కోసిన భర్త.. ఆత్మకూరులో దారుణం

భార్య గొంతు కోసిన భర్త ఆత్మకూరులో దారుణం అనుమానంతో హత్యాయత్నం బాధితురాలి పరిస్థితి విషమం కాకతీయ, ఆత్మకూరు...

గిరిజన వసతి గృహంలో హింసాత్మక ఘటన

గిరిజన వసతి గృహంలో హింసాత్మక ఘటన ఇంటర్ విద్యార్థుల దాడి.. 9వ తరగతి...

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య! అదనపు కట్నం కాటుకు యువతి బలి తాండూరులో...

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img