epaper
Thursday, January 15, 2026
epaper

గ్రామీణుల‌ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి

గ్రామీణుల‌ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి
పంచాయతీలు స్వయం సంపన్నంగా మారాలి
అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరం
గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ శంకుస్థాపన
సత్తుపల్లికి మరింత కీర్తి తెస్తాం : మంత్రి తుమ్మల

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీలు ఆదాయ మార్గాలు పెంచుకొని అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… 1964 ప్రాంతంలోనే సత్తుపల్లి మండలంలోని కిష్టారం, గంగారంలో హైస్కూల్ నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తెచ్చిన మంచి పేరును కాపాడుకోవడమే కాకుండా, అంతకంటే ఎక్కువ కీర్తి తీసుకొచ్చేలా తనవంతు కృషి చేశానని తెలిపారు. శ్రీరామచంద్ర స్వామి దయతో గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుతున్నాయన్నారు.

మౌలిక వసతులతో అభివృద్ధి

జనవరి తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా కేవలం 34 నిమిషాల్లో ఖమ్మం చేరుకునే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సత్తుపల్లి అన్ని మండలాలకు అనువైన కేంద్ర బిందువుగా ఉండేలా కల్లూరు డివిజన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతులు బలోపేతం చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.గ్రామపంచాయతీలు తమ ఆదాయాలను పెంచుకొని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. సత్తుపల్లి ప్రాంతానికి పూర్వం నుంచే మంచి పేరు ఉందని, ఆ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రాజకీయాల్లో నిబద్ధతతో పని చేస్తేనే దీర్ఘకాలం నిలబడగలమని, క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ప్రజలు ఆదరించరని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img