epaper
Sunday, March 1, 2026
epaper

గ్రామీణుల‌ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి

గ్రామీణుల‌ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి
పంచాయతీలు స్వయం సంపన్నంగా మారాలి
అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరం
గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ శంకుస్థాపన
సత్తుపల్లికి మరింత కీర్తి తెస్తాం : మంత్రి తుమ్మల

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీలు ఆదాయ మార్గాలు పెంచుకొని అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… 1964 ప్రాంతంలోనే సత్తుపల్లి మండలంలోని కిష్టారం, గంగారంలో హైస్కూల్ నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తెచ్చిన మంచి పేరును కాపాడుకోవడమే కాకుండా, అంతకంటే ఎక్కువ కీర్తి తీసుకొచ్చేలా తనవంతు కృషి చేశానని తెలిపారు. శ్రీరామచంద్ర స్వామి దయతో గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరుతున్నాయన్నారు.

మౌలిక వసతులతో అభివృద్ధి

జనవరి తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా కేవలం 34 నిమిషాల్లో ఖమ్మం చేరుకునే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సత్తుపల్లి అన్ని మండలాలకు అనువైన కేంద్ర బిందువుగా ఉండేలా కల్లూరు డివిజన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతులు బలోపేతం చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.గ్రామపంచాయతీలు తమ ఆదాయాలను పెంచుకొని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. సత్తుపల్లి ప్రాంతానికి పూర్వం నుంచే మంచి పేరు ఉందని, ఆ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. రాజకీయాల్లో నిబద్ధతతో పని చేస్తేనే దీర్ఘకాలం నిలబడగలమని, క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ప్రజలు ఆదరించరని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా

పంచాయతీ కార్మికులకు భరోసా.. 15 లక్షల ప్రమాద బీమా కాకతీయ, చింతకాని :...

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన

“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్...

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం సరిహద్దుల్లో విజిబుల్ పోలీసింగ్ పటిష్టం చేయాలి అక్రమ రవాణాపై కేసులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img