యూట్యూబర్ రఘుపై ఫిర్యాదు
మంత్రి తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల వినతి
కాకతీయ, రఘునాథపాలెం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్ ఛానల్కు చెందిన తొలివెలుగు రఘుపై రఘునాథపాలెం మండల కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 40 సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా పనిచేస్తున్న మంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐకి లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


