epaper
Sunday, March 1, 2026
epaper

బట్టీల్లో నలిగిపోతున్న బాల్యం

బట్టీల్లో నలిగిపోతున్న బాల్యం
ఇటుక బ‌ట్టిల్లో నిబంధనలకు తిలోదకాలు
వసతుల్లేని వలస జీవనం.. దుర్భర పరిస్థితులు
ధనార్జనే ధ్యేయంగా బట్టీల నిర్వాహకుల ఆగడాలు
నిద్రావస్థలో పెద్ద‌ప‌ల్లి జిల్లా అధికార యంత్రాంగం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బతుకుదెరువు కోసం స్వగ్రామాలను విడిచిపెట్టి వచ్చిన వలస కార్మికులు ఇటుక బట్టీల మధ్య నలిగిపోతున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, నివాస వసతులు లేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా బట్టీల్లోనే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు చదువుకోవాల్సిన వయసులోని పిల్లలను ఇటుక తయారీ పనుల్లోకి దింపుతూ బట్టీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్‌, ఇరిగేషన్, కార్మిక శాఖలు మాత్రం మౌనంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 200కు పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నట్లు అంచనా. వీటిలో ఎక్కువ శాతం బట్టీలు అనుమతులు, పర్యవేక్షణ లేకుండానే సీజనల్ పేరుతో కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు కుటుంబాలతో సహా బట్టీల వద్దే తాత్కాలిక షెడ్లలో నివసిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.

బట్టీల్లో మగ్గుతున్న బాల్యం

చిన్నచేతులు పుస్తకాలు పట్టాల్సిన వయసులో ఇటుకల మట్టిని మోస్తూ, ఎండలో పని చేస్తూ కనిపిస్తున్నాయి. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం ఇటుక బట్టీలు ప్రమాదకర పనుల విభాగంలోకి వస్తాయి. 14 ఏళ్ల లోపు పిల్లలతో పని చేయించడం పూర్తిగా నిషేధం. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న కిశోరులను కూడా ఇటుక తయారీ వంటి ప్రమాదకర పనుల్లో పెట్టడం చట్టవిరుద్ధమే. అయినా జిల్లాలో ఈ చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బాల కార్మికులతో పని చేయిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయి. అయినా జిల్లాలో ఒక్క బట్టీపై కూడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు అరుదుగా కనిపిస్తున్నాయి. కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల వైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ధనార్జనే ధ్యేయం

ఇటుక బట్టీల నిర్వాహకులు లాభాలే లక్ష్యంగా చట్టాలు, మానవత్వాన్ని పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వలస కార్మికుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వెట్టి చాకిరికి నెట్టడం సాధారణమైందన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బట్టీ యజమానుల అగడాలకు హద్దే లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గౌరెడ్డిపేట ప్రాంతంలో ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన వలస కార్మికులపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే బట్టీల వద్ద ఫుడ్ పాయిజన్ ఘటనల్లో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడం కూడా నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజులు నిఘా పెంచిన అధికారులు ఆ తర్వాత మళ్లీ మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇటుక బట్టీలపై సమగ్ర తనిఖీలు చేపట్టి, బాల కార్మికులను విముక్తి చేసి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దోపిడీ కొనసాగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌,...

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిరిసిల్ల ఎస్పీ...

ఆవుల‌పై పులి దాడి

ఆవుల‌పై పులి దాడి మోత్కరావుపేట శివారులో అడుగులు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చ‌రిక‌ కాకతీయ, రుద్రంగి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img