ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అల్ ది బెస్ట్
* తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి
* మంచి ఉత్తిర్ణత సాధించి ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి
* విద్యార్థులంతా సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి
* భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాకతీయ,చేర్యాల: రేపటి నుండి జరగబోయే ఇంటర్మిడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు (యంగ్ ఫ్రెండ్స్) అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు అనేవి కీలక మైలురాళ్లని చెప్పారు. విద్యార్థులంతా చదువుపైనే దృష్టి పెట్టి కష్టపడి చదవాలని అన్నారు. పరీక్షలు రాసే సమయంలో సమయాన్ని తెలివిగా వాడుకోవాలని సూచించారు. మిమ్మల్ని మీరు నమ్మితే విజయం మీ వెంటే వస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇష్టపడి… ఆత్మవిశ్వాసం తో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ అమ్మానాన్నల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ఆకాంక్షించారు. పరీక్షల్లో మంచి ఉత్తిర్ణత సాధించి ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.విద్యార్థులతా ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్షలు రాసే వారంతా సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఎంపీ సూచించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికీ గురికావొద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్నీ సౌకర్యాలు కల్పించామని, ప్రతి ఒక్కరూ పరీక్షలపైనే ఫోకస్ పెట్టాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాశీస్సులు తెలిపారు.


