epaper
Sunday, March 1, 2026
epaper

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ
సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అసత్యమని స్పష్టం
వాలెట్ లావాదేవీలకు మాత్రమే ప్రత్యేక నిబంధనలు వర్తింపు
పిన్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిక

కాకతీయ, నేష‌న‌ల్‌ బ్యూరో : దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో రూ.1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P), వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఎన్‌పీసీఐ తెలిపింది. రూ.1000 మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ మొత్తాలకు కూడా సాధారణ వినియోగదారులపై ఛార్జీలు ఉండవని పేర్కొంది.

గందరగోళానికి కారణం వాలెట్ లావాదేవీలు
కొన్ని యూపీఐ యాప్‌లలో (ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే వంటి) వాలెట్‌లో డబ్బు లోడ్ చేసి, అక్కడి నుంచి వ్యాపారులకు చెల్లింపులు చేసే సందర్భాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా రూ.2000కు పైగా వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే వ్యాపారులకు మాత్రమే చార్జీలు వర్తించవచ్చు. అయితే ఈ రుసుమును వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం యూపీఐ ద్వారా సాధారణ వినియోగదారులు రోజుకు రూ.1 లక్ష వరకు లావాదేవీలు చేయవచ్చు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి కొన్ని ప్రత్యేక విభాగాలకు రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేసే అవకాశం కూడా ఉంది.

మోసాలపై జాగ్రత్త అవసరం
యూపీఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తమ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు సూచించారు. తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్‌పై స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగిస్తున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి! డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img