epaper
Sunday, March 1, 2026
epaper

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు

ప్ర‌ధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్‌

పార్లమెంట్​ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీ ఆందోళ‌న‌

బీజేపీ తీరుకు వ్య‌తిరేకంగా నినాదాలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో (మీరు సరైనది అనుకున్నది చేయండి) అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పార్లమెంట్​ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఉదయం చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్, ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కొనసాగించారు. భారత్​, అమెరికా డీల్​ను ట్రాప్​ డీల్​గా వర్ణిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ సమయంలో వారితోపాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొని నినాదాలు చేశారు. అప్పుడే మీడియాతో మాట్లాడుతూ, జో ఉచిత్ సమ్జో వహీ కరో అంటూ విమర్శించారు.

అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటే: ఖ‌ర్గే

అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రసంగం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని, ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రసంగ సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. జాతీయ భద్రత, చైనా అంశాలపై తమ ఆందోళనలకు సరైన సమాధానం రాలేదనే కారణంతో సభను బహిష్కరించామని ఖర్గే తెలిపారు.
“ప్రధాని ప్రసంగానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పిన అసత్యాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. అబద్ధాలను పదేపదే చెప్పడం ఆయన అలవాటైపోయింది” అని ఖర్గే విమర్శించారు. 97 నిమిషాల ప్రసంగంలో ప్రధాని గత 100 ఏళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల చరిత్ర గురించి మాత్రమే మాట్లాడారని, కానీ ప్రస్తుత సమస్యలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన స్మృతిగ్రంథం (మెమోయర్) అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించిందని ఖర్గే ఆరోపించారు.

ప్రధాని ప్రసంగం అంతా అసత్యాలతోనే! జైరాం ర‌మేష్‌

అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్​ కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షం లేవనెత్తిన కీలక అంశాలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. “ప్రధాని ప్రసంగం అసత్యాలతో, అసహనంతో నిండి ఉంది. 97 నిమిషాల ప్రసంగం నిరాశాజనకం” అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని రమశ్ ఆరోపించారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశానని చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే చైనా అంశంలో కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి! డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img